English | Telugu
ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ
Updated : Oct 6, 2020
మరోవైపు, కేంద్ర కేబినెట్ లో చేరాలని జగన్ కు ఆహ్వానం అందిందని ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పర్యనటకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. వైసీపీకి రెండు కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవులను కేంద్రం ఆఫర్ చేసినట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, వైసీపీ నేతలు మాత్రం.. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను కేంద్రం నెరవేరుస్తామంటే తాము ఎన్డీయేలో చేరే అంశాన్ని పరిశీలిస్తామని అంటున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్డీయే లో చేరాలని తమకు ఎటువంటి ఆహ్వానమూ లేదని, అలాగే వైసీపీ సైతం ఆ ప్రతిపాదన చేయలేదని చెబుతున్నారు. వైసీపీ ఎన్డీయేలో చేరే అంశంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.