English | Telugu
మెగాస్టార్ ఆధ్వర్యంలో సి. సి. సి. మనకోసం
Updated : Mar 28, 2020
మొదటగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. " కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా సృష్టిస్తున్న కలకలం మనందరం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ సమయంలో మన సోదర కార్మికులకి మనం ఏం చేయగలం అని చిరంజీవి తన ఆలోచనతో ముందుకు వచ్చారు. చిరంజీవి ఆధర్యంలో సురేష్ బాబు , నేను, ఎన్.శంకర్ , కల్యాణ్ , దాము కలిసి చిన్న కమిటీగా ఏర్పాటయ్యి సీసీసీ అనే సంస్థ ద్వారా చిత్ర పరిశ్రమ కార్మికుల సంక్షేమార్థం పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం.," అని వివరించారు. దీనికి నాందిగా మొదట చిరంజీవి కోటి రూపాయలను ప్రకటించారు. నాగార్జున కోటి రూపాయలు, ఎన్టీఆర్ 25లక్షలు ఇలా విరాళాలు ప్రకటించారు. వీరే కాకుండా ఎవరైనా సినిమా పరిశ్రమ కార్మికులను ఆదుకోవచ్చు.. కరోనా మహమ్మారి వల్ల పలు సమస్యలకు లోనవుతున్న సినీ కార్మికుల సంక్షేమమే ఈ సంస్థ ముఖ్య ఆశయమని భరద్వాజ పేర్కొన్నారు.