English | Telugu
ఎరువుల కొరత రానివ్వం.. కేంద్రమంత్రి హామి
Updated : Jul 20, 2020
సోమవారం ఢిల్లీలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి సదానంద గౌడను కలిసి తెలంగాణకు రావాల్సిన ఎరువులు వెంటనే విడుదల చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని మంత్రి చెప్పారు. తెలంగాణలో పూర్తి అయిన ప్రాజెక్టుల కారణంగా ఆయకట్టు బాగా పెరిగిందన్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించామన్నారు. జులై నెలాఖరు నాటికి రావాల్సిన 1.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందజేస్తామని కేంద్రమంత్రి చెప్పారన్నారు.దేశాన్ని కరోనా మహమ్మారి ఇబ్బంది పెడుతున్న తరుణంలో వ్యవసాయానికి కరోనా నిబంధనల నుండి మినహాయింపు ఇవ్వడం వల్లనే ఈ రోజు ఆహారధాన్యాలకు కొరత లేదన్నారు.