English | Telugu
కొనుగోలు కేంద్రాలలో సామాజిక దూరం పాటించాల్సిందే!
Updated : Apr 10, 2020
వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో పనిచేసి కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు, కొనుగోలు కేంద్రాల సక్రమ పనితీరుకు చర్యలు తీసుకుంటున్నారు. రైస్ మిల్లుల మిల్లింగ్ సామర్థ్యం మరియు నిల్వ సామర్థ్యం పెరగడం మరియు బియ్యం మిల్లింగ్ పరిశ్రమకు ప్రభుత్వం నుండి అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు.
ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు విషయంలో నిపుణుల సేవలను వినియోగించుకుని బియ్యం మిల్లింగ్ పరిశ్రమ మరియు రాష్ట్రంలో ఆహార ప్రక్రియ పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో చర్చించారు.