English | Telugu

స్థానిక ఎన్నికలపై స్టే ఇవ్వలేం! ఏపీ సర్కార్ కు హైకోర్టు షాక్ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికల ప్రక్రియను ప్రస్తుత పరిస్థితుల్లో నిలుపుదల చేయలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్టే ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఎన్నికల కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 14కు వాయిదా వేసింది. గతంలో కరోణా కారణంగా వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందు కోసం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని జగన్ సర్కార్ చెబుతోంది. దీని కోసమే హైకోర్టుకు వెళ్లింది. ఫిబ్రవరిలో జరపతలపెట్టిన స్థానిక ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ సర్కార్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఎన్నికలపై స్టే ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.