English | Telugu
తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు!!
Updated : Nov 28, 2020
మరోవైపు, నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని, ఆ తరువాత ఆరు నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయి మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమని అన్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యల చూస్తోంటే.. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకొని, నిజంగానే కేసీఅర్ ప్రభుత్వం కూలిపోతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.