English | Telugu
ప్రపంచంలోని కరోనా వ్యాక్సిన్ డేటా పై కన్నేసిన రష్యా గూఢచారులు..
Updated : Jul 17, 2020
రష్యాకు చెందిన ఏపీటీ29 అనే గ్రూప్ ఈ సైబర్ ఎటాక్ చేసినట్టు ఆయా దేశాల సైబర్ సెక్యూరిటీ విభాగాలు గుర్తించాయి. ద డ్యూక్స్, కాజీ బేర్ అని పిలవబడే ఈ గ్రూప్ రష్యా నిఘా విభాగానికి అనుబంధ సంస్థ. రష్యాకు చెందిన ఈ హ్యాకర్లు తమ మేధావులు, హెల్త్ కేర్కు చెందిన విభాగాలపై సైబర్ ఎటాక్ చేసి కీలకమైన సమాచారం చోరీ చేయడానికి ప్రయత్నించారని యూకే జాతీయ సైబర్ భద్రతా విభాగం ఆరోపించింది. 2016 అమెరికా ఎన్నికల సమయంలో కూడా వీరు అమెరికన్ డేటాను హ్యాక్ చేసినట్టు ప్రచారం ఉంది. ఐతే కరోనా వైరస్ వ్యాక్సిన్ సమాచారం హ్యాక్ చేయడానికి వీరు ప్రయత్నించినట్టు మొట్టమొదటి సారి వెలుగులోకి వచ్చింది. ఐతే ఈ సైబర్ ఎటాక్స్ తో మాకు సంబంధం లేదని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పష్టం చేసారు. బ్రిటన్ లోని కోవిడ్ 19 రీసెర్చ్ సెంటర్లు, ఫార్మా కంపెనీల మీద సైబర్ ఎటాక్ ఎవరు చేశారో తమకు తెలీదు అని అయన ప్రకటించారు.