English | Telugu
బెంగాల్ లో బీజేపీకి 10 సీట్ల లోపే! రాజకీయాల నుంచి తప్పుకుంటానని పీకే సవాల్
Updated : Dec 21, 2020
బెంగాల్ లో బీజేపీ దూకుడుగా ఉండగా... ఆ పార్టీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఎన్ని ఎత్తులు వేసినా బెంగాల్ లో బీజేపీ పది సీట్లు కూడా గెలుచుకోలేదని అన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రశాంత్ కిషోర్.. మళ్లీ మమతా బెనర్జీనే విజయం సాధిస్తారని చెప్పారు. అంతేకాదు బెంగాల్లో బీజేపీకి డబుల్ డిజిట్ కంటే ఎక్కువ సీట్లు వస్తే.. తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు పీకే. 2014 ఎన్నికల నుంచి ప్రశాంత్ కిషోర్ అనేక పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు బెంగాల్ తో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.