English | Telugu
అంబటి రాంబాబుకు సొంత పార్టీ కేడర్ షాక్..
Updated : Aug 26, 2020
సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని రాజుపాలెం మండలం నెమలిపురి, కొండమోడులో ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. అయితే ఈ పిల్ను హైకోర్టు న్యాయవాది నాగ రఘు వైసీపీ కార్యకర్తల తరఫున దాఖలు చేయడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నట్లు కలెక్టర్, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం జగన్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వైసీపీ కార్యకర్తలు ఈ పిటిషన్లో ఆరోపించారు. ఈ అక్రమ మైనింగ్ పై ఇప్పటికే స్ధానిక మైనింగ్ అధికారులు విచారణ జరిపారని కూడా ఆ పిటిషన్లో వారు పేర్కొన్నారు.
అయితే, అధికార పార్టీకి చెందిన వారే పిటిషన్ వేస్తె అది ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారం పై వెంటనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తరువాత కేసు విచారణను వచ్చే నెలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి ప్రకటించారు.