English | Telugu
ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి పునాది వేసి, అభివృద్ధికి సమాధి కట్టి ఏడాది అవుతోంది
Updated : Jun 25, 2020
మరోవైపు, ప్రజావేదిక కూల్చి నేటికి ఏడాది అయిన నేపథ్యంలో.. టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.
"ఒక భవనం కట్టడం ఎంతో కష్టం, ఉపయోగం. కూలగొట్టడం చిటికెలో పని, తీవ్ర నష్టం. ఇది తెలిసి కూడా విధ్వంసానికే జై కొడుతున్నారు. ఇటువంటివారిని పాలకుడిగా ఎన్నుకున్న పాపానికి ప్రజల సమస్యల పరిష్కారవేదికైన ప్రజావేదిక కూలగొట్టి.. ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి పునాది వేసి, అభివృద్ధికి సమాధి కట్టి ఏడాది అవుతోంది." అని లోకేష్ విమర్శించారు.
"చంద్రబాబు అంటే నవ్యాంధ్ర నిర్మాత, జగన్రెడ్డి అంటే నవ్యాంధ్ర నాశనానికి కంకణం కట్టుకున్న అరాచక పాలకుడని ప్రజావేదిక శిథిలాలు సాక్ష్యం చెబుతున్నాయి. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్మించి ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావేదికని కడితే, ఒక్క రాత్రిలో కూల్చేశారు జగన్రెడ్డి." అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.