English | Telugu
వేధింపులతో మింగేస్తున్నారు! వైసీపీపై నారా లోకేష్ ఫైర్
Updated : Nov 11, 2020
మరోవైపు అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులు సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ బెయిల్ రద్దు పిటిషన్పై గురువారం నంద్యాల కోర్టులో విచారణ జరుగనుంది. బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు రివిజన్ పిటిషన్ వేశారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా.. సర్కిల్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్రెడ్డి, హెడ్కానిస్టేబుల్ గంగాధర్ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరిపై క్రిమినల్ కేసు నమోదుచేశారు. నిందితులు సోమశేఖర్రెడ్డి, గంగాధర్కు నంద్యాల ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఏడు రోజుల రిమాండ్ విధించారు. నిందితులు బెయిల్ పిటిషన్ వేయగా ..ఇద్దరికి నంద్యాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కుటుంబ సభ్యులంతా సూసైడ్ చేసుకోవడానికి కారకులయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు వెంటనే బెయిల్ రావడంపై విమర్శలు వచ్చాయి. దీంతో బెయిల్ను రద్దు చేయాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు.