English | Telugu
అచ్చెన్నాయుడికి జగన్ ప్రభుత్వ సలహాదారు సంచలన ఆఫర్..!
Updated : Jun 15, 2020
వ్యాపార రంగం లో ఉన్న టీడీపీ నేతలను అధికారం అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెట్టి.. బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారని, ఏ వ్యాపారాలు లేని వారిని డబ్బు ఆశ చూపి పార్టీలో చేర్చుకుంటున్నారని అయన విమర్శించారు. తాజాగా సిద్దా రాఘవరావు విషయం లో ఇదే జరిగింది. పార్టీలో చేరేవరకు గ్రానైట్ ఎక్స్ పోర్ట్ అనుమతి నిలిపి వేసిన జగన్ ప్రభుత్వం అయన పార్టీ తీర్థం పుచ్చుకున్న మరు క్షణం అనుమతులు ఇచ్చేసారు.
మాకేం కాలేదులే అని ప్రజలు చూస్తూ ఊరుకుంటే త్వరలో గజదొంగలు ప్రజలపై పడతారని లోకేష్ హెచ్చరించారు. పదహారు నెలలు జైల్లో ఉన్న జగన్ తనలాగా అందర్నీ జైలుకు పంపించాలనుకుంటున్నారని అయన మండిపడ్డారు. జగన్ తప్పు చేశారు కాబట్టి బెయిల్ కూడా రాక పదహారు నెలలు జైల్లో ఉన్నారని లోకేష్ విమర్శించారు. వైసిపి ఎన్నిఅరాచకాలు చేసినా తమ మనో స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన స్పష్టం చేశారు. తాజాగా అచ్చెన్నాయుడు కుటుంబానికి ప్రభుత్వ సలహాదారు యాభై కోట్ల ఆఫర్ ఇచ్చారనే విషయం బయటకు రావడం రాజకీయంగా కలకలం రేపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.