English | Telugu
జగన్ నాయకుడో? దద్దమ్మో వైసీపీ శ్రేణులు తేల్చుకోవాలి
Updated : Sep 11, 2020
రాష్ట్ర ప్రజలకు సేవ చెయ్యాల్సిన ఒక మంత్రితో ప్రతిపక్ష నాయకుడ్ని బూతులు తిట్టించి ఆనంద పడిన రోజు జగన్ రెడ్డి గారికి చట్టాలు, మర్యాద, సాంప్రదాయాలు గుర్తురాలేదా? అని లోకేష్ ప్రశ్నించారు. రాజారెడ్డి రాజ్యాంగంలో బూతులు తిట్టిన వైకాపా నాయకుల పై చర్యలు ఉండవు అని రాసుకున్నారా? అని నిలదీశారు.
మేము కూడా తిట్టగలం కానీ మా పార్టీ సంస్కృతి అది కాదు అని చెప్పినందుకు బ్రహ్మంపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తారా? అని మండిపడ్డారు. బ్రహ్మంకి పార్టీ అండగా ఉంటుందని అన్నారు. మా కార్యకర్త విమర్శకి సమాధానం చెప్పే దమ్ములేక కేసులు పెట్టే జగన్ నాయకుడో? దద్దమ్మో వైకాపా శ్రేణులు తేల్చుకోవాలి అని లోకేష్ వ్యాఖ్యానించారు.