English | Telugu
ఏలూరు వింత రోగానికి కారణం ఇదే.. నిపుణుల అంచనా..!
Updated : Dec 7, 2020
న్యూరో టాక్సిన్స్ కారణంగా ఈ పరిస్థితులు తలెత్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. తినే ఆహారం లేదా తాగునీరు లేదా పాల ద్వారా ఈ వింత రోగం వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. రోగుల నాడీ వ్యవస్థపై న్యూరో టాక్జిన్స్ ప్రభావం చూపించడం తో ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. బాధితుల్లో కంటి నల్లగుడ్డు స్పందన తగ్గిన లక్షణాన్ని వైద్యులు తాజాగా గుర్తించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో సోమవారం పరిశీలించిన రోగుల్లో 70 నుంచి 80 శాతం మందికి ఈ సమస్య ఉందని గుర్తించారు. వైద్య పరిభాషలో "ప్యూపిల్ డైలటేషన్" గా దీనిని వైద్యులు పేర్కొంటున్నారు. ఇది మయో క్లోనిక్ ఎపిలెప్సీ కావచ్చని గుంటూరు వైద్య నిపుణుల బృందం చెబుతోంది.