English | Telugu
10 వేల మందితో పులివెందులలో సభ పెట్టే దమ్ముంది నాకు.. రఘురామరాజు
Updated : Sep 18, 2020
ఎంపీ రఘురామకృష్ణం రాజు మీడియాతో మాట్లాడుతూ ‘‘తోలు తీయడం నా వృత్తి కాదండి. వారు బహుభాషా కోవిదులు. అలా మాట్లాడటం కాస్తో కూస్తో వచ్చినా... నాలో నేను మాట్లాడతాను కానీ.. ప్రజలు అసహ్యించుకొని.. ఉమ్మేసేలా మాట్లాడటం నాకు చేతకాదు. దానికి నేనేమీ చేయలేను. సంస్కార వంతులు.. సంస్కారాన్ని గౌరవించే వాళ్లు, విజ్ఞులు అయిన వాళ్లు 90శాతం మంది ఉన్నారు. అయితే ఇలాంటి తోలు తీసే చేష్టలకు, తగిన సమాధానం చెప్పే స్నేహితులు కూడా నాకున్నారు. ఎంపీ రాజా భయ్యా.. నాకు మంచి స్నేహితుడు. అయన అసలు పేరు రఘు రాజ్ ప్రతాప్. రాజా భయ్యా మాత్రమే కాదు.. నన్ను కంటికి రెప్పలా కాపాడేవాళ్లు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. నా ఒంటిపై చిన్న చేయి పడితే.. దానికి స్పందించి.. నన్ను కాపాడగలిగే వ్యక్తులు, స్నేహితులు అటు రాయలసీమలో కూడా ఉన్నారు. పులివెందులలో కూడా నా స్నేహితులు ఉన్నారు. పదివేల మందితో పులివెందులలో సభ పెట్టగల కెపాసిటీ నాకు ఉంది. అయితే ఈ విషయాలన్నీ కరోనా తగ్గిన తర్వాత చూద్దాం. న్యాయస్థానాల్లో నాకు న్యాయం జరుగుతుంది’’ అని అయన తెలిపారు.