English | Telugu
గోమూత్రం తో కరోనాకు మందు.. ఐసిఎంఆర్ కోర్టులో బంతి
Updated : Jul 28, 2020
ఈ కేసు వివరాల్లోకి వెళితే కరోనా ట్రీట్మెంట్కి తాము గోమూత్రం తో తయారుచేసిన ఆయుర్వేద మందును వాడేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ కోరారు. కోజికోడ్ జిల్లా తిరువంబడికి చెందిన వెల్నెస్ కన్సల్టెంట్, సోషల్ వర్కర్ సన్స్ అనే సంస్థ ఈ పిటిషన్ వేసింది. కొన్నిఆమోదం పొందిన ఆయుర్వేద మందులతో పాటు గోమూత్రం కలిపి తాము తయారుచేసిన ఔషధం అటు కరోనా అంతు చూడడమే కాక ఈ వైరస్ వ్యాప్తిని కూడా అరికడుతుందని ఆ సంస్థ కోర్టుకు తెలిపింది.
అంతే కాకుండా "ఈ మందు కరోనా పీడితులలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని దీంతో కరోనా వైరస్తో పోరాడేలా చేస్తుందని" కోర్టులో వేసిన పిటిషన్లో తెలిపారు. పిటిషనర్ తరపున లాయర్ నందకుమార్ కోర్టులో తన వాదనలు వినిపిస్తూ తమ మందుకు అనుమతి ఇవ్వాలని ఐసిఎంఆర్ ను అభ్యర్ధించగా ఇంతవరకూ స్పందించలేదని కోర్టుకు తెలిపారు. గోమూత్రం వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని అందుకే దాన్ని ఆయుర్వేద మందుల తయారీలో వాడతారని అయన కోర్టులో వివరించారు. ఇంకా ఈ మందులో హిమాలయాలలో దొరికే బెర్రీ మూలికతో పాటు మరి కొన్ని వనమూలికలు, గోమూత్రాన్ని కలిపి మందుగా తయారుచేశామని అయన కోర్టుకు తెలిపారు. తాజాగా ఇదే విషయాన్ని ప్రధాని మోదీ కూడా తన మన్కీ బాత్ కార్యక్రమంలో కూడా వివరించారని అయన కోర్టుకు తెలిపారు. అంతే కాకుండా మెడికల్ ప్రాక్టీషనర్ అధ్వర్యంలోనే ఈ మందును తయారుచేసినట్లు అయన కోర్టుకు వివరించారు.
ఇప్పటికే కొన్ని అల్లోపతి మందులను కరోనా పేషెంట్లకు వాడేందుకు అధికారుల అనుమతులు లభించిన నేపథ్యంలో తమ ఆయుర్వేద మందుకు అనుమతి ఎందుకు ఇవ్వరన్నది పిటిషనర్ వాదన. దీంతో ఇపుడు బంతి ఐసిఎంఆర్ కోర్టుకు చేరింది. మరి దీనిపై ఐసిఎంఆర్ ఏ విధంగా స్పందిసుందో వేచి చూడాలి.