English | Telugu
రాములమ్మ ఇంటికి ఠాగూర్.. శాంతించేనా?
Updated : Nov 4, 2020
విజయశాంతి బీజేపీలోకి వెళ్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. హోరాహోరీ పోరు సాగిన దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలోనూ ఆమె పాల్గొనలేదు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీగా పని చేసిన రాములమ్మ ఆ జిల్లా పరిధిలోని జరిగిన కీలక ఎన్నికలో ప్రచారం చేయకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. పీసీసీ పెద్ద నేతలంతా దుబ్బాకకు వెళ్లగా రాములమ్మ మాత్రం అటువైపు చూడలేదు. ఇక ఇటీవలే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో ఆమె సమావేశమయ్యారు. దీంతో విజయశాంతి బీజేపీలోకి వెళ్తారని అంతా భావించారు. కాని అది జరగలేదు. తాజాగా ఆమెను బుజ్జగించేందుకు మాణిక్యం ఠాగూర్ స్వయంగా రంగంలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఠాగూర్ చర్చల తర్వాత రాములమ్మ మెత్తబడినట్లు, కాంగ్రెస్ లోనే కొనసాగుతానని చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం.