English | Telugu
ప్రజలను గాలికి వదిలేయలేం.. మీకు చేతనైంది చేసుకోండి...
Updated : Jul 17, 2020
ఇపుడు అధికార యంత్రాంగం ఒకటి రెండు రోజుల్లో లాక్ డౌన్ ప్రకటించే ఆలోచన చేస్తుండగా అధికార పార్టీ నాయకులు కొందరు అడ్డుపడుతున్నట్లుగా కూడా సమాచారం. ఐతే లాక్ డౌన్ విషయం పై ఈ రోజు అన్ని శాఖల అధికారులు కలిసి కరోనా నియంత్రణ కోసం ఒకనిర్ణయం తీసుకోబోతున్నామని ఆ పార్టీ నాయకులకు తెలిపినట్లు సమాచారం. దీని గురించి మీ లోకల్ నాయకత్వానికి చెప్పుకోవాలని ఒక వేళ అధికారులు తీసుకునే నిర్ణయం కనుక నచ్చకపోతే 24 గంటల్లో తమను ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చని కూడా వారు స్పష్టం చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా కొద్ది రోజులు లాక్ డౌన్ పెట్టి కరోనా వైరస్ చైన్ ను బ్రేక్ చేసి నూజివీడు ప్రజలను ఈ మహమ్మారి నుండి బయట పడేయాలని అధికార యంత్రాంగం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.