English | Telugu
జైలులో ఆత్మహత్య చేసుకున్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు
Updated : Oct 14, 2020
దాదాపు 19 ఎకరాల భూమికి సంబంధించిన వివాదాన్ని క్లియర్ చేయడానికి నాగరాజు లంచం డిమాండ్ చేస్తున్నారని అప్పట్లో ఎసిబి అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసులో నెల రోజులుగా ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇక తాను ఈ కేసు నుంచి బయటపడటం సాధ్యం కాదని భావించడం వల్లే నాగరాజు ఆత్మహత్య చేసుకొని ఉంటారని తెలుస్తోంది. ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.