English | Telugu

కల్వకుంట్ల కవిత డ్రైవర్ కు కరోనా.. ప్రస్తుతం ఆమె హోమ్ ఐసోలేషన్

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గడం లేదు. కామన్ మ్యాన్ నుండి వీఐపీల వరకు అందరిని చుట్టేస్తోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం మొహమ్మద్ అలీ సహా పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ మహమ్మారి బారినపడ్డారు. తాజాగా, నిజామాబాద్ మాజీ ఎంపీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత కారు డ్రైవర్ కు కరోనా సోకడంతో ఆమె కూడా హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఇది ఇలా ఉండగా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య నిన్న 50 వేల మార్కును దాటేసాయి. అదే సమయంలో, ఇప్పటి వరకు 447 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11,052 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.