English | Telugu

పోటీ అదరనుంది.. మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న జగ్గారెడ్డి భార్య

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) రాజకీయ జీవితం మునిసిపల్ చైర్మన్ గా మొదలైంది. ఆ తర్వాత 2004, 2009, 2018 లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తన రాజకీయ జీవితం ఎక్కడ నుంచి ప్రారంభమైందో అక్కడ నుండి తన భార్య రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిచాలని చూస్తున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆమె సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటిస్తారని తెలుస్తోంది. తూర్పు నిర్మల ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జగ్గారెడ్డి రాజకీయ కార్యకలాపాలపై సహకారమందిస్తూ ఆయన లేని టైంలో నియోజకవర్గ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. దీంతో ఆమెను బరిలోకి దించి చైర్మన్ చేస్తే బాగుటుందని ఆయన భావిస్తున్నారు. అయితే బిజెపి నుండి అప్పట్లో చైర్మన్ చేసిన జగ్గారెడ్డి ఇప్పుడు భార్యను చైర్మన్ చేసుకుంటారా అనే చర్చ జోరుగా నడుస్తోంది. ఏదేమైనా సంగారెడ్డి లో జగ్గారెడ్డి భార్య బరిలోకి దిగనున్నారని ప్రచారం జరుగుతుండటంతో ఈ సీటు హాట్ ఫేవరెట్ గా మారింది.