English | Telugu
సీనియర్ ఐఏఎస్ కు షాక్.. ఏపీ కొత్త సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్..!
Updated : Oct 15, 2020
అయితే జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సీనీయర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యానాథ్ దాస్ ను త్వరలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వాదనలకు బలం చేకూర్చేలా ఏపీ ప్రభుత్వం.. హఠాత్తుగా బుధవారం రాత్రి చేసిన బదిలీలే నిదర్శనం అని అధికార వర్గాలలో చర్చ జరుగుతోంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆదిత్యనాథ్ దాస్ అత్యంత కీలకమైన భారీ నీటి పారుదల శాఖ నిర్వహించారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఆయన పేరు కూడా ఉంది. అయితే ఆయనపై ఉన్న అభియోగాలపై విచారణను హైకోర్టు నిలిపివేసింది. ఈ ఆదేశాలపై సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు దీనిపై ఆదిత్యనాథ్ దాస్కు నోటీసులు కూడా జారీ చేసింది.
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎస్ గా ఉన్న నీలం సాహ్ని పదవీకాలం ఎప్పుడో ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఆమెకు ఇప్పటికే రెండు సార్లు పదవీకాలాన్ని పొడిగించారు. అయితే ఆమె పదవీకాలం ఇక కేంద్రం పొడిగించే అవకాశం లేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా నీలం సాహ్ని పదవీకాలాన్ని పొడిగించాలని కోరలేదు. దీంతో కొత్త సీఎస్ ఎంపిక అనివార్యమౌతోంది.