English | Telugu

రంగంలోకి చిరంజీవి, దిల్ రాజు.. టాలీవుడ్ లో ఏం జరుగుతోంది..?

రంగంలోకి చిరంజీవి, దిల్ రాజు.. టాలీవుడ్ లో ఏం జరుగుతోంది..?

Publish Date:Aug 5, 2025

  సినీ కార్మికుల వేతనాలు 30 శాతం పెంచకపోతే షూటింగ్ లకు హాజరయ్యేది లేదని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే వేతనాలు ఎక్కువగా ఉన్నాయని, ఒకేసారి అంత శాతం పెంచడం కుదరదని నిర్మాతలు చెబుతున్నారు. అవసరమైతే యూనియన్ తో సంబంధం లేకుండా వర్కర్స్ ని తీసుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవితో నిర్మాతలు సమావేశమయ్యారు. చిరంజీవిని కలిసిన వారిలో సి. కళ్యాణ్, అల్లు అరవింద్, సురేష్ బాబు, మైత్రి రవి శంకర్, సుప్రియ యార్లగడ్డ ఉన్నారు.    చిరంజీవితో భేటీ అనంతరం నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ.. "మేము చిరంజీవి గారిని కలసి సమస్య చెప్పాము. 'షూటింగ్స్ సడెన్ గా ఆపడం భావ్యం కాదు. మీ సమస్యలు చెప్పారు, అటు వైపు కార్మికుల వెర్షన్ ను కూడా తెలుసుకుంటాను. రెండు మూడు రోజులు చూసి, పరిస్థితి చక్కబడకపోతే నేను జోక్యం చేసుకుంటాను' అని చిరంజీవి గారు చెప్పారు." అని తెలిపారు.    ఇక సినీ కార్మికుల ఆందోళనపై ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పందించారు. "కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. హైదరాబాదులో బతకాలంటే జీతాలు పెరగాలి. ఢిల్లీ పర్యటన తర్వాత కార్మికులతో నేను మాట్లాడతాను. ఈ అంశాలన్నిటిని కూడా దిల్ రాజు కు అప్పగించాము, ఆయన చర్చిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు.. టికెట్ల ధరలు పెంచేందుకు మేము అనుమతులు ఇస్తున్నాం. కార్మికులు అడుగుతున్న డిమాండ్లపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి." అని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు.   
Youtuber Slams Producer Naga Vamsi for his comments on Reviewers

Youtuber Slams Producer Naga Vamsi for his comments on Reviewers

Publish Date:Aug 5, 2025

Producer Naga Vamsi has been actively promoting his film, Kingdom, starring Vijay Deverakonda and Satyadev, Bhagyashree Borse. He has been giving interviews and he participated in a round table with different media personalities. In that video, he commented on a Youtube Reviewer, Barbell's review, indirectly.  He commented that how can a person go to watch RRR, when they have made Kingdom. These comments have hurt the Youtuber and he released a reply video. In that Barbell, made some shocking revelations and stated that Naga Vamsi, himself approached him for an interview and then appreciated some of his negative reviews for other films. Barbell further slammed him stating that he is trying to control freedom of speech and even manipulating Industry reviewers. He further remarked that he did not like the way, he shouted talking about his comments. He stated that Naga Vamsi has been maintaining double standards by encouraging "negativity" for others while hoping only "positive" words for his films.  The Youtuber further stated that he is no longer looking to be in contact with the producer. He revealed that he is already been facing court cases against him from Telugu Cinema personalities and he would never give up on his right for free speech.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

తను సినిమా నటినని కోర్టులో ప్రూవ్‌ చేసుకున్న వాణిశ్రీ.. ఎందుకో తెలుసా? 

Publish Date:Aug 2, 2025

(ఆగస్ట్‌ 3 వాణిశ్రీ పుట్టినరోజు సందర్భంగా..) పాతతరం కథానాయికల్లో మహానటి సావిత్రిది ఒక శకం అని చెప్పొచ్చు. సావిత్రిలాంటి నటి మరొకరు లేరు, రారు అనుకుంటున్న సమయంలో ఓ వెలుగులా చిత్ర పరిశ్రమలోకి దూసుకొచ్చారు వాణిశ్రీ. సావిత్రి పోలికలతోనే వాణిశ్రీ ఉందని అందరూ అనుకున్నారు. సావిత్రి మాదిరిగానే మొదట చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ కథానాయికగా ఎదిగారు. పొగరు గల ధనవంతురాలిగా, ఆత్మాభిమానం కలిగిన మధ్య తరగతి యువతిగా, అమాయకురాలిగా, అణకువ కలిగిన భార్యగా, చిలిపి పనులు చేస్తూ నవ్వించే అమ్మాయిగా.. ఇలా ఏ పాత్రలోనైనా తన అద్భుతమైన నటనతో మెప్పించగల ప్రతిభాశాలి వాణిశ్రీ.  1948 ఆగస్ట్‌ 3న నెల్లూరులో రాఘవయ్య, వెంకమ్మ దంపతులకు రెండో కుమార్తెగా జన్మించారు వాణిశ్రీ. ఆమె అసలు పేరు రత్నకుమారి. చిన్నతనంలోనే టి.బి.తో తండ్రి చనిపోయారు. ఒక్క నెలలోనే వారి కుటుంబంలోని ముగ్గురు అదే వ్యాధితో మరణించారు. వెంకమ్మ తన ఇద్దరు కుమార్తెలతో జీవనం సాగించారు. వాణిశ్రీ చదువుకుంటూనే నాట్యం నేర్చుకున్నారు. స్కూల్‌లో జరిగిన ఒక ఫంక్షన్‌లో వాణిశ్రీ డాన్స్‌ చూసిన కన్నడ డైరెక్టర్‌ హునుసూరు కృష్ణమూర్తి.. తను చేస్తున్న వీరసంకల్ప చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలోని నటనకు, చేసిన డాన్సులకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఎన్నో నాటకాల్లో నటించారు వాణిశ్రీ. ముఖ్యంగా చిల్లకొట్టు చిట్టెమ్మ, రక్తకన్నీరు, రాగరాగిణి, దొంగ వంటి నాటకాల్లో ముఖ్యపాత్రలు పోషించారు. వీరసంకల్ప రషెస్‌ చూసిన బి.విఠలాచార్య నవగ్రహ పూజా మహిమ చిత్రంలో చిన్న వేషం ఇచ్చారు. ఆ తర్వాత కన్నడలో కొన్ని సినిమాల్లో నటించారు.  ఎ.వి.ఎం సంస్థ నిర్మించిన నానుమ్‌ ఒరుపెణ్‌ చిత్రాన్ని తన సొంత బేనర్‌ శ్రీవాణి ఫిలింస్‌ పతాకంపై నాదీ ఆడజన్మే పేరుతో నిర్మించాలనుకున్నారు ఎస్‌.వి.రంగారావు. అందులోని ప్రధాన పాత్ర కోసం వాణిశ్రీని ఎంపిక చేశారు. ఆ సమయంలోనే తమ బేనర్‌ పేరు కూడా కలిసి వచ్చేలా రత్నకుమారి పేరును వాణిశ్రీగా మార్చారు ఎస్వీఆర్‌. అయితే కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర జమునకు దక్కింది. బాలీవుడ్‌ నటి వైజయంతిమాలను వాణిశ్రీ ఆదర్శంగా తీసుకున్నారు. నటనలోని మెళకువలు, డైలాగులు ఎలా చెప్పాలి వంటి విషయాలు ఎస్వీఆర్‌ నేర్పించారు. 1967లో వచ్చిన మరపురాని కథ వాణిశ్రీ భవిష్యత్తుకు మంచి పునాది వేసింది. అప్పటివరకు జానపద చిత్రాలు రాజ్యమేలాయి. వాణిశ్రీ ఇండస్ట్రీలోకి వచ్చే సమయానికి జానపదాలు తగ్గుతూ వచ్చాయి. ఆ సమయంలోనే ఎన్నో సాంఘిక చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు వాణిశ్రీ.  ఇలా ఉండగా, 1969లో అన్నపూర్ణ సంస్థ నిర్మించిన ఆత్మీయులు చిత్రంలో తొలిసారి అక్కినేని నాగేశ్వరరావు సరసన నటించారు వాణిశ్రీ. ఈ సినిమాలో మొదట అక్కినేనికి చెల్లెలుగా నటించమని అడిగారు నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు. కానీ, తను హీరోయిన్‌గా అయితేనే చేస్తానని పట్టుబట్టి దాన్ని సాధించుకున్నారు. అక్కినేనికి చెల్లెలుగా విజయనిర్మల నటించారు. ఆ తర్వాత అక్కినేని, వాణిశ్రీ కాంబినేషన్‌లోనే వచ్చిన భలే రంగడు కూడా ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్‌తో నటించిన తొలి సినిమా నిండు హృదయాలు. హాస్యనటుడు పద్మనాభం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కథానాయిక మొల్ల చిత్రంలో మొల్ల పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు వాణిశ్రీ. ఈ సినిమాకి నంది అవార్డు లభించింది.  సాధారణంగా హీరోలకు లేడీస్‌ ఫాలోయింగ్‌ ఉంటుంది. కానీ, వాణిశ్రీకి మహిళా అభిమానులు చాలా ఎక్కువ. ఎందుకంటే ఆమె చీరకట్టుకునే విధానం, హెయిర్‌ స్టైల్‌, జ్యూయలరీ.. మహిళలను విపరీతంగా ఆకర్షించేవి. ఈ విషయాల్లో వాణిశ్రీ ఎన్నో ప్రయోగాలు చేశారు. తన గెటప్‌ విషయంలో ఆమెకు పూర్తి అవగాహన ఉండడంతో దర్శకనిర్మాతలు కూడా ఆమె ఏది చేస్తే అదే బెస్ట్‌ అనేవారు. ఒక శిల్పంలా అందంగా కనిపించేందుకు వాణిశ్రీ ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. సరైన డైట్‌ పాటిస్తూ స్లిమ్‌గా ఉండేందుకు ప్రయత్నించేవారు. ఆరోజుల్లో నవలా పఠనం ఎక్కువగా ఉండేది. ఆయా నవలల్లో కథానాయిక ఎలా ఉందని వర్ణిస్తారో దానికి నిజమైన రూపంగా వాణిశ్రీ కనిపించేవారు. అందుకే లెక్కకు మించిన నవలా చిత్రాల్లో వాణిశ్రీ హీరోయిన్‌గా నటించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వాణిశ్రీ తర్వాత నవలా నాయిక అని పేరు తెచ్చుకున్న నటి మరొకరు లేరు.  1970 దశకం వచ్చేసరికి వాణిశ్రీ టాప్‌ హీరోయిన్‌గా ఎదిగారు. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌,  శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు, హరనాథ్‌, కాంతారావు, రంగనాథ్‌, రామకృష్ణ వంటి అగ్రశ్రేణి హీరోల సరసన హీరోయిన్‌గా నటించారు. అలా వచ్చిన దసరాబుల్లోడు, కొడుకు కోడలు, ప్రేమనగర్‌, బంగారుబాబు, దేశోద్ధారకులు, ఎదురులేని మనిషి, ఎదురీత, కన్నవారి కలలు, గంగ-మంగ, చక్రవాకం, జీవనజ్యోతి, ఇల్లు ఇల్లాలు, రైతుబిడ్డ, చీకటి వెలుగులు, చక్రధారి, భక్తకన్నప్ప, జీవనతరంగాలు, కృష్ణవేణి, వంటి ఎన్నో సినిమాలు బాక్సాఫీసు వద్ద విజయాలు సాధించాయి. తమిళంలో శివాజీ గణేశన్‌ వంటి అగ్రశ్రేణి నటులతో 80 సినిమాల్లో వాణిశ్రీ నటించారు. అలాగే కన్నడలో రాజకుమార్‌ వంటి హీరోల సరసన 30 సినిమాల్లో నటించారు. అయితే మలయాళంలో మాత్రం కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించారు. 1981లో వచ్చిన దేవుడు మావయ్య హీరోయిన్‌గా ఆమె చివరి సినిమా. ఆమె కెరీర్‌లో మేకప్‌ లేకుండా నటించిన సినిమాలు రెండు. బాపు దర్శకత్వంలో వచ్చిన గోరంతదీపం, శ్యామ్‌ బెనెగల్‌ దర్శకత్వంలో రూపొందిన అనుగ్రహం. హీరోయిన్‌గా కొన్ని వందల సినిమాల్లో నటించినప్పటికీ తను చేసిన సినిమాల్లో కృష్ణవేణి, ఇద్దరు అమ్మాయిలు మాత్రమే తనకు నచ్చిన సినిమాలని చెబుతారు వాణిశ్రీ.  హీరోయిన్‌గా టాప్‌ పొజిషన్‌లో ఉన్నప్పుడే జరిగిన ఓ సంఘటన వాణిశ్రీ సినిమాలు విరమించడానికి కారణమైంది. అప్పటివరకు ఎన్నో పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్‌.. కమర్షియల్‌ హీరోగా నటించిన సినిమా ఎదురులేని మనిషి. ఈ సినిమాను కె.బాపయ్య డైరెక్ట్‌ చేశారు. ఈ సినిమాలోని కసిగా ఉంది.. కసికసిగా ఉంది.., కృష్ణా ముకుందా మురారి.. అనే పాటల చిత్రీకరణ వాణిశ్రీని ఎంతో బాధపెట్టాయి. అప్పటివరకు ఏ సినిమాలోనూ అలాంటి పాటలు వాణిశ్రీ చేయలేదు. ఇలాంటి డాన్సులు చేయడం వల్ల ప్రేక్షకుల్లో తనపై ఉన్న గౌరవం పోతుందని భావించిన వాణిశ్రీ.. ఆ పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే సినిమాలకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అయితే అప్పటికే చాలా సినిమాలు కమిట్‌ అయి ఉండడం వల్ల అవి పూర్తి చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అలా దేవుడు మావయ్య చిత్రంతో హీరోయిన్‌గానే రిటైర్‌ అయ్యారు వాణిశ్రీ.  సినిమాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్న మరుసటి సంవత్సరం 1978లో చెంగల్పట్టుకు చెందిన డాక్టర్‌ కరుణాకరన్‌ను వివాహం చేసుకున్నారు వాణిశ్రీ. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. వాణిశ్రీ సినిమాలు చేస్తున్న సమయంలో ఆమెకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ తన అక్క భర్త చూసుకునేవారు. అలా చాలా ఆస్తులు ఆమె బావ పేరు మీదే ఉన్నాయి. పెళ్ళి తర్వాత తన ఆస్తులు తిరిగి ఇవ్వాలని వాణిశ్రీ కోరారు. దానికి ఆమె అక్క, బావ ఇద్దరూ ఒప్పుకోకవడంతో వాణిశ్రీ భర్త కోర్టుకెక్కారు. కొన్ని సంవత్సరాలపాటు ఈ కేసు కోర్టులోనే ఉంది. ఒక దశలో తన పేరు వాణిశ్రీ అనీ, ఆ ఆస్తులన్నీ సినిమాల్లో నటించడం ద్వారానే సంపాదించానని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమాల్లో నటించడం ద్వారా నిర్మాతలు డబ్బు ఇచ్చినట్టు అగ్రిమెంట్లు ఉంటే కేసు గెలుస్తామని వాణిశ్రీ తరఫు న్యాయవాది చెప్పడంతో ఆ ప్రూఫ్‌ కోసం సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేశారు. అలా నటించిన మొదటి సినిమా అత్తకు యముడు అమ్మాయికి మొగుడు. ఈ సినిమా సూపర్‌హిట్‌ కావడమే కాకుండా వాణిశ్రీ పోషించిన అత్త క్యారెక్టర్‌కి విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. దీంతో మళ్లీ అవకాశాలు వెల్లువెత్తాయి. అలా బొబ్బిలిరాజా, సీతారత్నంగారి అబ్బాయి, ఏవండీ ఆవిడ వచ్చింది, పెద్దింటల్లుడు, స్వాతిచినుకులు, రాజేశ్వరీ కళ్యాణం వంటి వైవిధ్యమైన సినిమాల్లో వాణిశ్రీ నటించారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ 60 సినిమాలు చేయడం విశేషం.  సినిమాలు వద్దనుకొని 1981లోనే రిటైర్‌ అయిన వాణిశ్రీ.. తాను సినిమాల్లో నటించడం ద్వారా ఆస్తులు సంపాదించానని నిరూపించుకోవడం కోసమే తన సెకండ్‌ ఇన్నింగ్‌ ప్రారంభించారు. మొదటి ఇన్నింగ్స్‌లో, సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ తన స్థాయికి తగిన సినిమాలే చేశారు తప్ప విమర్శలకు తావిచ్చే క్యారెక్టర్స్‌ వాణిశ్రీ ఎప్పుడూ చేయలేదు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో సినిమాలు చేయడం ద్వారా కోర్టు కోరిన అగ్రిమెంట్లు సమర్పించి కేసు గెలిచారు. దీంతో ఆస్తులు తిరిగి అప్పగించారు వాణిశ్రీ అక్క, బావ. అయితే ఆ తర్వాత వారు ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా అనారోగ్యం పాలు కావడంతో వారిని ఆదుకున్నారు వాణిశ్రీ. ఇదిలా ఉంటే.. 2020లో వాణిశ్రీ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. డాక్టర్‌గా పనిచేస్తున్న కుమారుడు అభినయ్‌ ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ షాక్‌కి గురిచేసింది. వాణిశ్రీ చివరిగా నటించిన సినిమా భద్రాద్రి రాముడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు.  

7 నెలల్లో 110 కోట్ల ఆస్తుల అమ్మకం.. విదేశాలకు జంప్‌ అవుతున్న స్టార్‌ హీరో?

Publish Date:Aug 4, 2025

సాధారణంగా చిత్ర పరిశ్రమలోని నటీనటులు తమ కెరీర్‌ ఉజ్వలంగా సాగుతున్న సమయంలో వాళ్లు సంపాదించిన దాన్ని ఎక్కువ శాతం ఆస్తులు కొనడంలోనే ఉపయోగిస్తారు. అలా చిత్ర పరిశ్రమలో కుబేరులుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే వారికి భిన్నంగా ఒక బాలీవుడ్‌ స్టార్‌ హీరో తన ఆస్తుల్ని ఒక్కొక్కటిగా అమ్ముతూ వస్తున్నారు. జనవరిలో మొదలుపెట్టి ఇప్పటివరకు 8 ఆస్తుల్ని కొన్న దానికంటే కొన్ని రెట్లు లాభాలకు అమ్మేశారు. అలా ఇప్పటివరకు 100 కోట్లు పొందారు. అతనెవరో కాదు, బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌.  ముంబైలో ఉన్న తన ఆస్తుల్ని వరసగా అమ్మడం బాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అక్షయ్‌ ఇలా ఎందుకు చేస్తున్నాడు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ముంబాయిలోని బోరివాలి, వర్లి, లోయర్‌ పరేల్‌లోని లగ్జరీ అపార్ట్‌మెంట్లు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లను అమ్మేశారు. దీనిపై బాలీవుడ్‌లో భారీగా చర్చలు జరుగుతున్నాయి. అలాగే సోషల్‌ మీడియాలో కూడా నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ పెడుతున్నారు. ముంబై నుంచి అక్షయ్‌ మకాం మారుస్తున్నాడనేది ప్రధానంగా వినిపిస్తున్న వార్త. ఇండియాలో కాకుండా విదేశాల్లో స్థిరపడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడన్నది మరో వార్త. ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నాడని కూడా చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో ఏది నిజం అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వార్తపై అక్షయ్‌ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.  1987లో ‘ఆజ్‌’ చిత్రంలో కరాటే ఇన్‌స్ట్రక్టర్‌గా చిన్న పాత్రలో తొలిసారి కనిపించారు అక్షయ్‌కుమార్‌. ఆ తర్వాత నాలుగేళ్ళపాటు ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనికి ఎవరూ అవకాశం ఇవ్వలేదు. 1991లో ‘సౌగంధ్‌’ చిత్రంలో తొలిసారి హీరోగా నటించే అవకాశం వచ్చింది. మరో రెండు సినిమాల్లో నటించిన తర్వాత ‘ఖిలాడి’ చిత్రం అక్షయ్‌కి బ్రేక్‌ ఇచ్చింది. ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. నటుడిగానే కాకుండా, మంచి డాన్సర్‌గా, ఫైటర్‌గా ప్రేక్షకుల్ని మెప్పించారు. అక్షయ్‌కి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువ. చాలా సంవత్సరాలు అతను ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందారు. ఇప్పుడు అక్షయ్‌కుమార్‌ విదేశాలకు వెళ్లిపోతున్నాడన్న వార్త వైరల్‌ అయిపోవడంతో దీనిపై అతను ఎలాంటి క్లారిటీ ఇస్తాడోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

Jayam serial: రుద్రకి దొరికిన గంగ చెవికమ్మ.. అతను ఏం చేయనున్నాడు!

Publish Date:Aug 5, 2025

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -19 లో......సూపర్ మార్కెట్ లో రుద్ర మీటింగ్ పెడతాడు. సేల్స్ ఎలా పెంచాలని రుద్ర వాళ్లకు గైడ్ చేస్తాడు. మరి ఈ మీటింగ్ కి గంగని ఎందుకు రమ్మన్నావవని రుద్రని పెద్దసారు అడుగుతాడు. గంగ బయటకు వెళ్లి వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటూ బయటున్న కస్టమర్స్ ని లోపలికి పంపిస్తుంది. ఆ తర్వాత సరుకులు తీసుకొని గంగ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. నిన్ను చూసి సరుకులు ఇవ్వడానికి వచ్చానని అమ్మతో గంగ చెప్తుంది. అప్పుడే పైడిరాజు బండిపై వస్తాడు. అంతేకాకుండా వాళ్లకు బట్టలు కూడా తీసుకొని వస్తాడు. నువ్వేదో కొంపముంచే పనే చేసి ఉంటావని గంగ వాళ్ళ అమ్మ తిడుతుంది. నాన్న నా కోసం బట్టలు తీసుకొని వచ్చాడు అని గంగ అవి తీసుకుంటుంది. ఆ తర్వాత నువ్వు నాకొక మాట ఇవ్వాలని పైడిరాజు గంగతో అనగానే సరే అని గంగ అంటుంది. మరోవైపు ఆ రుద్ర రూమ్ ముందుగా గంగ వెళ్తుంటే తన చెవికమ్మ ఒకటి రుద్ర గదిలో పడిపోతుంది. రుద్ర స్నానం చేస్తుంటే గంగ తన గదిలోకి వచ్చి చెవికమ్మ కోసం చూస్తుంది. రుద్ర అంటే కోపం కాబట్టి ఒక పిల్లోని తీసుకొని రుద్ర అనుకొని కొడుతుంది. అప్పుడే వెనకాల నుండి ఎవరో వచ్చి గంగ భుజంపై చెయ్ వేస్తాడు. తీరా చుస్తే వీరు.. నువ్వు ఈ గదిలో ఎందుకున్నావంటూ పంపిస్తాడు. ఆ తర్వాత రుద్రకి గంగ చెవికమ్మ గుచ్చుకుంటుంది. ఎవరు నా గదిలోకి వచ్చారని అందరిని అడుగుతాడు. ఎవరు రాలేదని రుద్ర వాళ్ళ అమ్మ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Nazeeruddin Shaik wins aha Telugu Indian Idol 3

Publish Date:Sep 23, 2024

In a thrilling grand finale streamed on aha OTT, 19-year-old Nazeeruddin Shaik from Andhra Pradesh emerged victorious as the winner of aha Telugu Indian Idol Season 3. His captivating performances throughout the competition earned him both the prestigious title and a cash prize of Rs. 10 lakh. Recently clearing his CA intermediate examinations, Nazeeruddin also received the exciting opportunity to lend his voice to the highly anticipated upcoming film starring Pawan Kalyan, OG. His remarkable journey to victory was characterised by consistent excellence, which endeared him to both the audience and the judges. Anirudh Suswaram secured second place, winning Rs. 3 lakh, while GV Shri Kerthi claimed third place with a prize of Rs. 2 lakh. The show, which concluded after nearly 26 weeks of fierce competition, was judged by the esteemed Thaman S, Geetha Madhuri, and Karthik, all of whom noted that this season showcased extraordinary talent. Judge Geetha Madhuri said, "aha Telugu Indian Idol Season 3 was an incredible experience filled with talented contestants. It truly felt like a celebration of music. Choosing the finalists was extremely challenging, and every elimination was painful." Nazeeruddin was born on November 2, 2004, in Tadepalligudem to Shaik Baji, a motor mechanic, and Madeena Beebi, who passed away a year ago. His sister, Vahida Rehman, has stepped in to support him after their mother's passing. He completed his schooling at Vignana Vikas E.M School and continued his education at GSR E.M School. He pursued his Junior College and CA Intermediate at Sri Medha Commerce College in Guntur, aspiring to become a Chartered Accountant while nurturing his passion for music. Nazeeruddin's musical journey has been profoundly shaped by his maternal grandparents, Kasim Saheb and Fatima Bee. His maternal grandmother, a Carnatic music guru, played a pivotal role in cultivating his talent. Growing up listening to the iconic songs of Ghantasala ignited his dedication to music. Reflecting on his victory, Nazeeruddin shared, "My journey with music began when I was just four years old. It was my grandfather, Kasim garu, and his sister whom I affectionately call Nani, who introduced me to this world. She enrolled me in Carnatic music lessons, while my grandfather taught me the nuances of cinematic music. Having sung for Ghantasala garu, his admiration for him has never wavered. For 47 years, he has honored Ghantasala's memory by observing his death anniversary in our village, Tadepalligudem. Thanks to my grandfather's efforts, a statue of Ghantasala garu stands in our village." "Winning the title of Telugu Indian Idol Season 3 is a key milestone for me. Performing in front of Thaman sir, Geetha Madhuri ma’am, and Karthik sir was an honor. Their feedback, along with lessons from my fellow contestants, has shaped my growth as a singer. Moving forward, I aim to be a leading musician in the industry while pursuing a career in finance, " he added. The competition began with over 15,000 aspiring singers, showcasing immense talent throughout the season. Initial auditions took place on May 4, 2024, in New Jersey and Hyderabad. The top 12 finalists included Bharat Raj, Keerthana, Keshav Ram, Hari Priya, GV Shri Kerthi, Nazeeruddin, Skanda, Duvvuri Sridhruthi, Rajani Sree, Sai Vallabha, Khushal Sharma, and Anirudh Suswaram. After rigorous eliminations and public voting across 28 episodes, the competition culminated in a final showdown featuring the top five contestants: Anirudh Suswaram, Skanda, Keerthana, Sri Keerthi, and Nazeeruddin. The finalists dazzled in vibrant attire during the blockbuster finale, which included special performances from the judges and contestants. Judge Geetha Madhuri, in a striking red outfit, captivated the audience with her exceptional performance. The Judges Thaman and Karthik also presented outstanding performances during the blockbuster finale episode. The blockbuster finale, streamed on September 20-21, 2024, celebrated the remarkable journeys of these talented singers. If you missed the thrilling finale episode, catch it now only on aha.

శివ దర్శకత్వంలో సూపర్ స్టార్.. ఫ్లాప్ దర్శకుడితో సాహసం!

Publish Date:Aug 5, 2025

  75 ఏళ్ళ వయసులోనూ సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆగస్టు 14న 'కూలీ'తో ప్రేక్షకులను పలకరించనున్నారు. అలాగే 'జైలర్-2' చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. శివ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా.. టాలీవుడ్ కి చెందిన బ్యానర్ లో రూపొందనుందని సమాచారం.   తెలుగులో 'శౌర్యం', 'దరువు' వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన శివ.. తమిళ్ లో అజిత్ తో చేసిన 'వీరం', 'వేదాళం', 'వివేగం', 'విశ్వాసం' సినిమాలతో మంచి కమర్షియల్ డైరెక్టర్ గా పేరు పొందాడు. ఆ తర్వాత రజినీకాంత్ తో అన్నాత్తే(పెద్దన్న) చేయగా, అది పరాజయం పాలైంది. ఇక గత చిత్రం 'కంగువా'ను సూర్యతో చేయగా.. అది డిజాస్టర్ అయింది. అయినప్పటికీ శివకి రజినీతో మరో సినిమా చేసే అవకాశం వచ్చిందట.   శివ తనకు ఫ్లాప్ ఇచ్చినప్పటికీ, ఆయనతో మరో సినిమా చేయడానికి రజినీకాంత్ రెడీ అవుతున్నట్లు వినికిడి. ఇప్పటికే కథా చర్చలు కూడా జరిగినట్లు టాక్. ఈ ప్రాజెక్ట్ ను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాస్ నిర్మించనున్నారని తెలుస్తోంది.  

Hansika Motwani indirectly confirms divorce rumors?

Publish Date:Aug 5, 2025

Hansika Motwani rose to stardom with Telugu film Deshamuduru. The beautiful lady became a rage among youth and she earned even more popularity in Tamil Cinema. She got married to Sohael Khaturiya in December 2022. The couple have released their wedding drama as a video on OTT platform, too.  Sohael being husband of Haniska's close friend, before their marriage, she even faced homewrecker tags. But Hansika stayed strong in her decision to get married to him. Recently, the rumors have been aplenty that the couple have separated and are applying for divorce.  Adding to fuel to all rumors, she deleted all her wedding photos and vidoes. Even all her photos with Sohael, on her Instagram page. This is being reported as an indirect confirmation about her divorce. Neither she nor Sohael have given any public statement but reports suggest that the couple are irreconcilable.  The actress became a Judge on TV shows like Dhee and she has been busy with several movie projects too. Earlier, Hansika had been in a relatioship with Silambarasan aka Simbu and after a public break-up, she announced her relationship with Sohael and even before three years, the couple are heading towards divorce.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

కింగ్‌డమ్

Publish Date:Jul 31, 2025

జూనియర్

Publish Date:Jul 18, 2025

Kingdom

Publish Date:Jul 31, 2025

Mahavatar Narsimha

Publish Date:Jul 25, 2025

Hari Hara Veera Mallu

Publish Date:Jul 24, 2025

Junior

Publish Date:Jul 18, 2025

Oh Bhama Ayyo Rama

Publish Date:Jul 11, 2025