భారత దేశం లో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఒక పక్క లాక్ డౌన్ సడలించడం తో పాటు ప్రజల రాకపోకలు పెరుగుతుండటం తో వైరస్ పల్లెలకు కూడా వ్యాప్తి చెందుతోంది. శుక్రవారం నాటికీ భారత్ లో కరోనా కేసుల సంఖ్య 2,35,000 గా నమోదయింది. దీంతో భారత్ ఇటలీ ని దాటి ఆరో స్థానం లోకి చేరింది. మొదటి స్థానం లో అమెరికా ఉండగా తరువాతి స్థానాల్లో బ్రెజిల్, రష్యా, స్పెయిన్, బ్రిటన్ నిలిచాయి. ఇక భారత దేశం లో గత 24 గంటల్లో 9.851 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా సోకి ఇప్పటివరకు 6,348 మంది మరణించారు. తాజాగా ఏపీ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,250 కి చేరింది. ఇటు తెలంగాణ లో కరోనా కేసుల సంఖ్య 3,290 కి చేరింది.