English | Telugu
గోవా డీజీపీ ప్రణబ్ నందా కన్నుమూత
Updated : Nov 16, 2019
గోవా డీజీపీ ప్రణబ్ నందా ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. అధికారిక పని మీద ఢిల్లీలో ఉన్న నందా నిద్రలోనే మరణించారని ఐజీ జస్పాల్ సింగ్ కన్ఫర్మ్ చేశారు. డీజీపీ నందా ఆకశ్మిక మరణం తమకు షాక్ కలిగించిందని ఐజీ జస్పాల్ సింగ్ అన్నారు.
2019 ఫిబ్రవరిలో గోవా డీజీపీగా నందా బాధ్యతలు చేపట్టారు. డైనమిక్ ఆఫీసర్ గా పేరున్న నందా.. ఢిల్లీ యూనివర్శిటీలో డిగ్రీ చదివి అనంతరం సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 1988 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ గా ప్రణబ్ నందా అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ స్టేట్ క్యాడర్ ల్లో పనిచేశారు. 2001లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధీనంలో ఉండే ఇంటలిజెన్స్ బ్యూరోలో డెప్యుటేషన్ పై చేరి దేశ, విదేశాల్లో వీవీఐపీ సెక్యూరిటీ వ్యవహారాలను పర్యవేక్షించేవారు.
కాబుల్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో భారత రాయబార కార్యాలయాల్లో భారతీయుల భద్రతాధికారిగా సేవలందించారు ప్రణబ్ నందా. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇండియన్ పోలీసు మెడల్, ప్రెసిడెంట్ పోలీసు మెడల్, స్పెషల్ డ్యూటీ మెడల్ కూడా లభించాయి.