English | Telugu
నయీం కేసు మళ్లీ తెరపైకి
Updated : Dec 14, 2020
ఒక సామాన్య పౌరుడికి ఆత్మ రక్షణ కోసం తుపాకీ లైసెన్స్ కావాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలతో కూడుకుని ఉంటుందన్నారు. అలాంటిది నయీంకు 24 తుపాకులకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వీటిలో 3 ఏకే-47 తో పాటు ఒక స్టెన్గన్ ఉండటం మరింత భయాందోళన కలిగిస్తోందని అన్నారు. సామాన్యులు భూమి కొనాలన్నా.. అమ్మాలన్నా.. ఆధార్, పాన్ కార్డు, లింకు డాక్యుమెంట్లు, ఫోటోతో సహా వేలిముద్రలు తదితర పత్రాలను సమర్పించాల్సి వస్తోంది. కానీ, అవేమీ లేకుండా నయీంకు 752 రిజిస్ట్రేషన్లు ఎలా సాధ్యం అయ్యాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. వేల ఎకరాలకు సంబంధించిన దాదాపు 752 రిజిస్ట్రేషన్ దస్తావేజులు లభ్యం కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. నయీం ఇంట్లో 602 సెల్ ఫోన్లు లభ్యం కావడంతో వీటన్నింటీ మంజూరు వ్యవహారంలో కచ్చితంగా నయీంకు పోలీసులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ ఇతర ప్రభుత్వ అధికారుల, రాజకీయ నేతల అండదండలు ఉన్నాయనే విషయాన్నిఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలను ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.