English | Telugu
కోమాలోనే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ..
Updated : Aug 14, 2020
గత సోమవారం తనకు కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని ట్విటర్ వేదికగా ప్రణబ్ ముఖర్జీ వెల్లడించిన సంగతి తెలిసిందే. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ నెల 10న ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో ప్రణబ్ ముఖర్జీకి అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. ఐతే చికిత్స తరవాత కూడా ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. ఐతే ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ, కూతురు షర్మిష్ట ముఖర్జీ ఖండించారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దని వారు సూచించారు.