English | Telugu

తెలంగాణ తొలి హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి కన్నుమూత 

తెలంగాణ తొలి హోం శాఖ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత, కార్మిక నాయకుడు నాయిని నర్సింహరెడ్డి నిన్న అర్ధరాత్రి దాటిన తరువాత కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. గతనెల 28న కరోనా సోకడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. అయితే అయన కరోనా నుండి కోలుకున్నా కూడా... కరోనా వల్ల ఏర్పడిన ఆరోగ్య సమస్యలతో బాధపడ్డ నాయిని అపోలోలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు శరీరంలో ఆక్సిజన్ స్థాయిలతో పాటు న్యూమోనియా కూడా సోకినట్టు వైద్యులు తేల్చారు. దీంతో ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించినప్పటికీ... ఆయన ప్రాణాలు దక్కలేదు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు నాయినిని అపోలో ఆసుపత్రిలో పరామర్శించిన సంగతి తెలిసందే. బుధవారం సాయంత్రమే సీఎం కేసీఆర్ నాయినిని ఆసుపత్రిలో పరామర్శించారు. నాయిని మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాయిని మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.