English | Telugu
ఈ-ఆఫీస్ ప్రారంభించిన సీఎస్
Updated : Jul 18, 2020
ఈ కొత్త విధానం ద్వారా పేపర్ లెస్ ఆఫీస్ తో పాటు పనుల్లో పారదర్శకత సాధ్యమవుతుందని ఆయన అన్నారు. దాదాపు 1600మంది ఉద్యోగులు పనిచేస్తారు. ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా త్వరగా ఫైళ్లు పరిష్కరించడానికి వీలవుతుందన్నారు. ప్రతి ఫిర్యాదు ఆన్ రికార్డులో అందుబాటులో ఉంటాయని, అధికారుల పనితీరు మరింత సులభం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.