English | Telugu
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Updated : Aug 14, 2025
కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 15) ఉధయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండపోయాయి. భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం (ఆగస్టు 14) శ్రీవారిని మొత్తం 66 వేల 530 మంది దర్శించుకున్నారు. వారిలో 32 వేల 478 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 66 లక్షల రూపాయలు వచ్చింది.