English | Telugu
చప్పట్లు, దీపాలు, పూలు! ఇప్పడు తీర్థంలా మద్యం!
Updated : May 5, 2020
కేంద్ర ప్రభుత్వం బుక్స్టాల్స్కు అనుమతులివ్వగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వైన్ షాపులకు మాత్రమే అనుమతి ఇచ్చి పుస్తకాల షాపులకు ఎందుకు ఇవ్వలేదని ఆయన ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు.
మద్యం షాపుల వద్ద లాక్డౌన్ నిబంధనలు పాటించడం లేదని ఆయన ఆరోపించారు. వ్యక్తిగత దూరం గాని కనీసం మాస్కులు కూడా లేకుండా మందుబాబులు బారులు తీరి లైన్లో నిల్చున్నారని అన్నారు. పోలీసుల బందోబస్తు మధ్య మద్యం అమ్మకాలు సాగించాల్సిన తొందర దేనికని, ఇలాంటి దుస్థితి నెలకొనడం విచారకరమని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.