English | Telugu
ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీపై ఊహాగానాలు నిజమేనా..!
Updated : Dec 14, 2020
ఈ నేపథ్యంలో సిపిఐ నేత నారాయణ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఏపీ హైకోర్టు సిజి జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీ పై నారాయణ మాట్లాడుతూ "ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరిని బదిలీ చేయించడానికి ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. సీఎం జగన్ ఈ విషయంపై కేంద్రంలో తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. ఇదే విషయం పై త్వరలో ఢిల్లీ వెళ్లి, బీజేపీ పెద్దలను కూడా కలవనున్నారు” అని సంచలన వ్యాఖ్యలు చేసారు. దీంతో ఈ బదిలీ వ్యవహారం పై ప్రజలలో పలు అనుమానాలతో పాటు ఈ విషయం పై ఉత్కంఠ కూడా నెలకొంది.