English | Telugu
దేశంలో కరోనా వాక్సిన్ పంపిణీకి ప్లాన్ సిద్ధం చేసిన కేంద్రం.. ముందుగా వారికే..
Updated : Oct 17, 2020
దేశంలోని 2 కోట్ల మంది రక్షణ సిబ్బంది, 70 లక్షల మంది వైద్య, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, 26 లక్షల మందికి పైగా సాధారణ ప్రజలు (50 ఏళ్లకు పైబడినవారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న 50 ఏళ్ల లోపు వ్యక్తులు) ఈ జాబితాలో ఉన్నారు. దీనికోసం బూస్టర్ డోస్ తో కలిపి మొదటి విడతలో 60 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరమవుతాయని కేంద్రం భావిస్తోంది. మొదటి దశలో వ్యాక్సిన్ అందుకునేవారి జాబితా అక్టోబరు నెలాఖరుకు గాని లేదంటే నవంబరు మొదటివారం నాటికి గాని సిద్ధమవుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.