English | Telugu
తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్.. భయపెడుతున్న లెక్కలు
Updated : Jun 23, 2020
కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 60,243 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు పరీక్షలు చేయించుకున్న ప్రతి వంద మందిలో 14 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా టెస్టుల పాజిటివ్ రేట్ 14.39 శాతం ఉంది. జాతీయ స్థాయిలో ఇది 6.11 శాతం ఉండగా, తెలంగాణలో రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక గత ఐదారు రోజులుగా నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే కరోనా టెస్టుల పాజిటివ్ రేట్ 20 శాతం పైగా ఉంది. పరీక్షలు చేయించుకుంటున్న ప్రతి వంద మందిలో 20 మందికి పైగా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడం మాములు విషయం కాదు. కావున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.