English | Telugu
జాగ్రత్తలు పాటించే సాక్షాత్తు ఉన్నతాధికారులను చుట్టుముడుతున్న కరోనా
Updated : Jun 12, 2020
ఇక సికిందరాబాద్ లోని రైల్వే డివిజన్ కార్యాలయంలో ఒక సీనియర్ అధికారికి కరోనా సోకింది. దీంతో ఆ భవనంలోని ఉద్యోగులను 11 గంటల కు ఇంటికి పంపించి వేశారు. కొద్దీ రోజుల క్రితం ఒక గూడ్స్ ట్రైన్ గార్డ్ కు కూడా కరోనా సోకింది. కొద్దీ రోజుల క్రితం కొండపోచమ్మ సాగర్ ముంపు ప్రాంత వాసులు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ను కలవడం జరిగింది తాజాగా అలా కలిసిన ఒక వ్యక్తికీ పాజిటివ్ రావడం తో సిద్ధిపేట కలెక్టర్ స్వయంగా గృహ నిర్బంధం లోకి వెళ్లారు.
మరో పక్క హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్ కు పాజిటివ్ తేలడం తో అయన కుటుంబం కూడా స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు. కొద్దీ రోజుల క్రితం ఒక మాజీ శాసనసభ్యుడు కుటుంబ సభ్యులు కరోనా బారిన పడి ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తరువాత కోలుకుని ఇంటికి చేరిన విషయం తెలిసిందే.
అందరికీ జాగ్రత్తలు చెప్పే అధికారులు కూడా కరోనా నుంచి తప్పించుకోలేకపోతున్నారు. కాబట్టి సామాన్యులు మరింత జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా బయటకు వెళ్ళకూడదు. బంధువుల పెళ్లి అనో, తెలిసిన వాళ్ళ విందు అనో మునుపటిలా జాగ్రత్తలు పాటించకుండా అసలు వెళ్ళకూడదు. ఈ సమయంలో మనం బాగుంటేనే మనవాళ్ళు బాగుంటారన్న విషయం గుర్తుంచుకొని జాగ్రత్తగా ఉండటం మంచిది.