English | Telugu
ముళ్లతీగలతో 2 వేల కిలోమీటర్ల గోడ! చైనా మరో వివాదాస్పద నిర్మాణం
Updated : Dec 18, 2020
మయన్మార్ సరిహద్దులో చైనా నిర్మిస్తున్న గోడపై అమెరికా ప్రభుత్వ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా కారణంగా రాబోయే దశాబ్దాల్లో దక్షిణాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. మయాన్మార్ కూడా చైనా తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ ఆర్మీ అధికారులు చైనా ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇరు దేశాల మధ్య 1961లో కుదిరిన సరిహద్దు ఒప్పందం గురించి లేఖలో ప్రస్తావించారు. అప్పటి ఒప్పందం ప్రకారం సరిహద్దు రేఖ వెంబడి ఇరు వైపులా 10 మీటర్ల వరకూ ఎటువంటి నిర్మాణం చేపట్టకూడదని, చైనా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి గోడ నిర్మిస్తుందని మయమ్నార్ ఆర్మీ అధికారులు లేఖలో స్పష్టం చేశారు.