English | Telugu
దుబ్బాకలో టీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి..!
Updated : Oct 5, 2020
దీంతో శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో రహస్య మంతనాలు జరిపినట్లుగా సమాచారం. దుబ్బాక అభ్యర్థిగా తన పేరును ప్రకటిస్తే పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు చెరుకు శ్రీనివాస్ రెడ్డి దామోదరతో చెప్పినట్లు తెలుస్తోంది. నిన్న అర్ధరాత్రి వరకు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కాంగ్రెస్ తరుఫున దుబ్బాక నుండి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ, స్థానికేతరుడు అయినందున ఆయనపై కాంగ్రెస్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డి చేరిక, టికెట్ పై ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ విషయం పై త్వరలోనే కాంగ్రెస్ పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.