English | Telugu
అలా చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా
Updated : Dec 17, 2020
‘‘ఒక కులంలో పుట్టడం నా తప్పా?. కులం చూసి హైదరాబాద్, విశాఖను అభివృద్ధి చేయలేదు. నా దగ్గర జగన్ తెలివి తేటలు పనిచేయవు. ద్రౌపది వస్త్రాపహరణం చేసినందుకు సామ్రాజ్యం కూలిపోయింది. మహిళల శాపంతో వైసీపీ నామరూపాలు లేకుండా పోతుంది’’ అని చంద్రబాబు హెచ్చరించారు. అమరావతి అంటే ఈ సీఎంకు ఎందుకింత కోపమో అర్థం కావట్లేదు. ఇవాళ రాజధాని రైతుల కోసం వైసీపీ తప్ప రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు వచ్చాయి. ఊరందరిదీ ఒకదారి అయితే ఈ ముఖ్యమంత్రిది మరోదారి. ఇంతకంటే వితండవాదం మరొకటి ఉంటుందా? అని విమర్శించారు. 10 వేల కోట్లు అమరావతిలో ఖర్చు చేస్తే శ్మశానం అంటారా? అని ప్రశ్నించారు. ఎడారి, శ్మశానం అనడానికి మీకు బుద్ధుందా అని మండిపడ్డారు.
రాష్ట్రమంతా నీతోనే ఉందని చెప్పుకుంటున్నావు కదా.. మరి రిఫరెండంకు వెళదామా? అని చంద్రబాబు జగన్ కు సవాల్ విసిరారు. మీరు ప్రజల ముందుకు వెళ్లి మూడు రాజధానులు కావాలా అని అడగండి.. ప్రజలు గనుక మూడు రాజధానులు కావాలి అని ఓటేస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చంద్రబాబు అన్నారు.