English | Telugu
కుటుంబ నియంత్రణపై బలవంతం చేయలేం.. అది దంపతుల ఇష్టం
Updated : Dec 12, 2020
కాగా, జనాభా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, అలాగే ఇద్దరు పిల్లల నిబంధనను తీసుకొచ్చేలా ఆదేశాలివ్వాలని బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీకుమార్ ఢిల్లీ హైకోర్టులో మొదట పిటిషన్ వేశారు. జనాభా నియంత్రణ పెరుగుదలతో కాలుష్యం, నిరుద్యోగం పెరగడంతో పాటు కనీస అవసరాలు ప్రతి ఒక్కరికీ అందడం లేదని పేర్కొన్నారు. అంతేగాక, జనాభా పెరుగుదల అవినీతికి కారణమవు తోందని ఆయన ఆరోపించారు. అయితే జనాభా నియంత్రణపై చట్టాలు చేసేది చట్టసభలు మాత్రమేనని, కోర్టులు కాదని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో, ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అశ్వినీకుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.