English | Telugu
ఐతే చర్చలు.. లేదంటే మిలట్రీ యాక్షన్.. చైనాకు బిపిన్ రావత్ స్ట్రాంగ్ వార్నింగ్
Updated : Aug 24, 2020
సరిహద్దుల వద్ద చైనా దుందుడుకు చర్యలను నిరోధించేందుకు రక్షణ దళాలు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాయని చెప్పారు. భారత ప్రభుత్వం దీనికి శాంతియుతంగానే పరిష్కారం కోరుతోందని, అయితే చర్చలు ఫలించకపోతే మాత్రం ఆర్మీని రంగంలోకి దింపడానికి, యుద్ధానికి కూడా సిద్ధమని అయన చెప్పారు. అయితే ఈ విభేదాలు మరింత ముదరకుండా ఉండేందుకు భారత్ చైనా కొన్ని రోజులుగా చర్చలు జరుపుతున్నాయి. అయితే ఏప్రిల్కి ముందు ఉన్న యథాతథ స్థితిని చైనా ఆర్మీ కొనసాగించాలని భారత సైన్యం పట్టుబడుతుండగా చైనా సైన్యం మాత్రం ససేమిరా అంటుండడంతో భారత్ తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది.