English | Telugu
ఈఎస్ఐ స్కామ్ లో మంత్రి కుమారుడికి బెంజి కారు లంచం.. అయ్యన్న సంచలన ఆరోపణలు
Updated : Sep 18, 2020
సీఎం జగన్ కు కార్మికశాఖ మంత్రి జయరాంపై దర్యాప్తు చేసే దమ్ము ఉందా..? మేము ప్రశ్నిస్తే మమ్మల్ని ముఖ్యమంత్రి బూతులు తిట్టిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై సీఎం మాత్రం నోరు మెదపరు. ఒకవేళ జగన్కు చిత్తశుద్ధి ఉంటే మంత్రి జయరాంతో రాజీనామా చేయించాలి లేదంటే మంత్రి మండలి నుంచి జయరాంను తప్పించాల్సిందే. దీనిపై విచారణకు ఆదేశిస్తే తాను ఈ విషయాన్నినిరూపిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపరులపై ఫిర్యాదు చేసేందుకు ప్రేవేశపెట్టిన 11440కు లైవ్లో కాల్ చేసి మంత్రి కుమారుడు ఈశ్వర్పై ఫిర్యాదు చేశారు. మంత్రి జయరాం అవినీతిలో సీఎం జగన్కు పోటీ పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా మంత్రి కొడుకుకు ఈఎస్ఐ స్కామ్ లో ఏ 14 నిందితుడుగా ఉన్న కార్తీక్ గిఫ్ట్ అందిస్తున్న కారు ఫోటోను అయ్యన్నపాత్రుడు మీడియాకు విడుదల చేసారు. ఈ ఫోటోను కార్తీక్ తన ఫేస్బుక్ లో కూడా పోస్టు చేశాడని ఆయన చెప్పారు.