English | Telugu

కరోనాపై గెలిచిన టీడీపీ నేత అచ్చెన్న.. త్వరలోనే డిశ్చార్జ్  

మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే అచ్చెనాయుడు కరోనా కోరల బారినుండి బయటపడ్డారు. తాజాగా ఆయనకు చేసిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ గా తేలింది. కొద్ది రోజుల క్రితం ఆయన కరోనా బారినపడగా ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరితగతిన కోలుకోవాలని కూడా ఆకాంక్షించారు. తాజాగా వచ్చిన ఈ రిపోర్ట్ తో ఇటు టీడీపీ శ్రేణులు అటు ఆయన కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన ఈరోజు.. రేపట్లోగా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారని తెలుస్తోంది. ఇప్పటికే ఈఎస్ఐ కుంభకోణం కేసులో అచ్చెన్నాయుడికి శుక్రవారం నాడు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళవద్దని కూడ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 70 రోజుల పాటు అచ్చెన్నాయుడు రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.