English | Telugu
ఏపీ మంత్రికి ప్రధాని మాటంటే అసలు లెక్క లేదు!
Updated : Mar 26, 2020
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ లాక్ డౌన్ సమయంలో దుర్గగుడిలో హల్ చల్ చేశారు. ఉగాది పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఉండి, ప్రధాని ఆదేశాలు బేఖాతర్ చేయడం చర్చనీయాంశమైంది. సామాన్య ప్రజలకు చెప్పాల్సింది పోయి.. ఇలా మంత్రి హోదాలో పూజలంటూ, పండగలంటూ తిరగటం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సామాన్యులకు మాత్రమే కరోనా సోకుతుందా?. కరోనా కి మంత్రా, ఎమ్మెల్యేనా, సామాన్యుడా అన్న భేదభావం ఉండదు.. ఎవరికైనా సోకుతుంది. ఎవరైనా లాక్ డౌన్ పాటించాల్సిందేనని హితవు పలుకుతున్నారు.
అన్నట్టు మంత్రి వెల్లంపల్లి.. ప్రధాని మాటని మాత్రమే కాదు.. హిందూ ఆచారాలను కూడా తుంగలో తొక్కారంటూ.. హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లి మరణించి ఇంకా ఏడాది పూర్తి కాకుండానే ఉగాది పంచాంగ శ్రవణం వంటి క్రతువుల్లో పాల్గొనేందుకు అవకాశం లేదని పండితులు చెబుతున్నారు. అయితే మంత్రి వెల్లంపల్లి మాత్రం లాక్ డౌన్ ని, ఆచారాలను రెండింటినీ పట్టించుకోకుండా.. దుర్గగుడిలో హల్ చల్ చేశారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఇలా రాష్ట్ర మంత్రే లాక్ డౌన్ ని పట్టించుకోకుండా ప్రవర్తించడంపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.