English | Telugu
గుంటూరు పోలీస్ స్టేషన్ పై దాడి కేసు ఎత్తివేతను ప్రశ్నించిన హైకోర్టు..
Updated : Sep 24, 2020
అయితే తాజాగా హైకోర్టులో పసుపులేటి గణేష్ అనే వ్యక్తి ఈ జీవోను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన కేసునే ప్రభుత్వం ఇలా ఎత్తేస్తూ పొతే.. ఇలాంటి నేరాలు భవిష్యత్లో పునరావృతం అయ్యే అవకాశం ఉందని.. కాబట్టి ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరపాలని హైకోర్టుకు పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు విచారణ సందర్భంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవోను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం జీవోలోని భాషపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. జీవోలో నేరుగా ముస్లిం యువత అని పేర్కొనడంపై న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ పిటిషన్లో ఎన్ఐఎని కూడా పార్టీగా చేర్చాలని సూచించిన ధర్మాసనం.. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ పై దాడి కేసును ఎత్తివేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబరు 1వ తేదీకి వాయిదా వేస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది.
అప్పట్లో ఓ చిన్నారిపై జరిగిన అత్యాచారం ఘటన విషయంలో పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసినప్పటికీ.. రాత్రికి రాత్రి కొంత మంది మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. అయితే ఆ ఘటన ఓ ప్రణాళిక ప్రకారం జరిగిందని అప్పట్లో పోలీసులు నిర్ధారించి అందులో పాల్గొన్న వారిపై కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఏపీలో కొత్తగా వచ్చిన వైసిపి ప్రభుత్వం ఆ కేసుల్ని ఉపసంహరించుకుటూ నిర్ణయం తీసుకుంది.