English | Telugu
కొన్ని క్షణాలలో నేను చనిపోతున్నా.. ఎవరు రావద్దు: శ్రీశైలం ప్రమాదంలో ఏఈ మోహన్ ఆఖరిమాటలు
Updated : Aug 21, 2020
ఇక మరో ఉద్యోగి ఉజ్మ ఫాతిమా పవర్ ప్లాంట్ ద్వారం వద్దకు కూడా చేరుకున్నారు. అయితే అమరాన్ కంపెనీ నుండి ఇద్దరు ఉద్యోగులు కొత్తగా బ్యాటరీలు బిగించేందుకు పవర్ ప్లాంట్ కు వచ్చారు. అయితే అమరాన్ ఉద్యోగులు ప్లాంట్ కు కొత్తవారు కావడంతో మళ్లీ వెనక్కు వెళ్లి వారిద్దరిని బయటకు పంపే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలోనే ఉజ్మా ఫాతిమా కూడ ఈ ప్రమాదంలో మరణించినట్టుగా తెలుస్తోంది. ప్లాంట్ లోని మరికొందరు అధికారులు కూడా ల్యాండ్ లైన్ ద్వారా చివరి నిమిషంలో తమ కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడి అగ్ని ప్రమాదం గురించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. 15 నిమిషాల్లో కనుక తాము బయటకు రాకపోతే చనిపోతామని అయితే పిల్లలను మాత్రం బాగా చదివించి ప్రయోజకులను చేయాలనీ వారు కుటుంబసభ్యులకు తెలిపారు.