English | Telugu
సలాం కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే! సీబీఐ విచారణకు బాబు డిమాండ్
Updated : Nov 12, 2020
కోర్టు చివాట్లు పెట్టినప్పుడైనా డీజీపీ మారి ఉంటే.. అబ్దుల్ సలాం కుటుంబానికి ఈ పరిస్థితి వచ్చేది కాదని చంద్రబాబు అన్నారు. సలాం కేసులో రైల్వే పోలీసులు కేసు నమోదు చేస్తే.. స్థానిక పోలీసులు తెలియనట్లు నటించారని చంద్రబాబు మండిపడ్డారు. సలాం కుటుంబసభ్యులు వీడియో విడుదల చేసే వరకూ..వాస్తవాలు బయటకు రాలేదన్నారు. తాను ట్వీట్ పెట్టాక పోలీసులు స్పందించారన్నారు. టీడీపీ న్యాయవాది వల్లే బెయిల్ వచ్చిందంటూ ప్రభుత్వం కొత్త నాటకం ఆడుతోందన్నారు. న్యాయవాదుల వల్ల బెయిల్లు వస్తాయా? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు అచ్చెన్న, కొల్లు రవీంద్ర, రాజధాని రైతులపై ఎలాంటి కేసులు పెట్టారని నిలదీశారు. పనికిమాలిన రాజకీయాలు చేస్తూ ఎవర్ని మోసం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.