English | Telugu
క్విడ్ ప్రోకో-2 మొదలెట్టిన జగన్.. యనమల తీవ్ర విమర్శలు
Updated : Oct 7, 2020
రూ.300 కోట్ల విలువైన రుషికొండ భూములను బినామీల పేర్లతో సీఎం జగన్ హస్తగతం చేసుకున్నారని అయన అన్నారు. దాదాపు రూ.120 కోట్లతో అభివృద్ధి చేసిన బేపార్క్ చేతులు మారడం వెనుక హస్తం ఎవరిదని ఈ సందర్భంగా యనమల ప్రశ్నించారు. ఎవరి ఒత్తిళ్ల మేరకు విశాఖ బేపార్క్ మేజర్ వాటాలు హెటిరో పరం అయ్యాయని అయన నిలదీశారు. మొన్న కాకినాడ సెజ్, ఈరోజు విశాఖ బేపార్క్ జగన్ బినామీల పరమైందని అయన ఆరోపించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తే... జగన్ మాత్రం బినామీ వ్యాపారాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. అప్పటి కేసులలో జగన్ సహనిందితులకే... ఇప్పటి పాలనలో మేలు జరుగుతోందని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.