English | Telugu
భారత్ లో ట్విట్టర్ పై వేటు తప్పదా..!
Updated : Nov 13, 2020
కొంత కాలం క్రితం కేంద్ర ప్రభుత్వం లడఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసి, దానికి లేహ్ను రాజధానిగా చేసింది. అయితే ట్విట్టర్ మాత్రం లేహ్ను చైనాలో భాగంగా చూపించింది. ఈ విషయాన్నీ తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ట్విట్టర్ అధినేత జాక్ డోర్సీకి లేఖ రాయడంతో పటంలో మార్పులు చేస్తూ.. ఈసారి దానిని జమ్మూకశ్మీర్లో భాగంగా మార్చేసింది. దీంతో ప్రభుత్వం ట్విట్టర్ పై మరోసారి మండిపడుతూ.. ఇలా ఎందుకు చూపించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.
తప్పుడు పటాన్ని చూపిస్తూ.. భారతదేశ సార్వభౌమత్వాన్ని అణగదొక్కేందుకు ఉద్దేశపూర్వకంగానే ట్విట్టర్ ఇలా చేస్తున్నట్టు గా పేర్కొంటూ.. దాని ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈసారి ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు చేయడంతో.. ట్విట్టర్ కనుక సంతృప్తికర వివరణ ఇవ్వకుంటే కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.