గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొద్ది రోజుల క్రితం జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ ఐన విషయం తెలిసిందే. ఆ తరువాత నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా కు అస్వస్థత కారణంగా కరోనా పరీక్షలు చేయగా ఆయనకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ లకు ముత్తిరెడ్డిని కలవడం ద్వారా ఈ వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ముగ్గురు వెమ్మెల్యేలు హైదరాబాద్ లోని ప్రయివేట్ ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారి తో కలిసిన పార్టీ నేతలు, అధికారులు ఆందోళనలో ఉన్నారు.