English | Telugu
సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Updated : Jun 29, 2020
సచివాలయం కూల్చివేతపై వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. సచివాలయ నిర్మాణం అనేది విధానపరమైన నిర్ణయమని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. ప్రస్తుతం ఉన్న సచివాలయం అన్ని అవసరాలకు సరిపోవట్లేదని, ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు.
వాదనలను విన్న హైకోర్టు తీర్పు వెలువరిస్తూ.. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేమని చెప్పింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ సచివాలయ కూల్చివేతకు అనుమతి ఇచ్చింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో పాత సచివాలయాన్ని కూల్చి.. కొత్త సచివాలయం నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది.